అంతరాష్ట్ర దొంగ అరెస్ట్.. 10 తులాల బంగారం స్వాధీనం

నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో Febలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మహారాష్ట్రకు చెందిన అంతరాష్ట్ర నేరస్థుడు షేక్ ఖయ్యుమ్ రఫిక్ బేగ్ (23)ను నవీపేట్ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేసి, అతడి నుంచి 10,8 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా, పక్కా సమాచారంతో నిందితుడిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో మహారాష్ట్ర, కర్ణాటకలోనూ అతడిపై కేసులు ఉన్నాయన్నారు. నిందితుడిని రిమాండ్కు పంపారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

