← Back to news

కోర్టుకు అల్లు అర్జున్ స్వయంగా వెళ్ళాల్సిందే?

By sahani· 19 Jun 2026· Hyderabad
కోర్టుకు అల్లు అర్జున్ స్వయంగా వెళ్ళాల్సిందే?

హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు గట్టి షాక్ తగిలింది. ఈ కేసును విచారిస్తున్న నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌తో పాటు మరో 19 మందికి సడన్‌గా కోర్టు నోటీసులు పంపించింది. ఈ కేసులో అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా చేర్చిన పోలీసులు, ఇప్పటికే మొత్తం 23 మందిపై ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. ఈ క్రమంలోనే సోమవారం (june 22) రోజు అల్లు అర్జున్ స్వయంగా కోర్టుకు వచ్చి హాజరుకావాలని ఆర్డర్ వేశారు. పుష్పా 2 ప్రీమియర్ షో టైమ్‌లో జరిగిన ఈ ఇన్సిడెంట్ కేసు ఇప్పుడు ఈ కోర్టు నోటీసులతో మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 23h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.