చిన్నారి మిస్సింగ్.. 72 గంటలుగా వీడని ఉత్కంఠ

AP: తండ్రి కోసం ఇంటి నుంచి వెళ్లిన రెండేళ్ల చిన్నారి శనివారం దారితప్పి అదృశ్యమైంది. కాకినాడ జిల్లా తుని మండలం రాజానగరం విలేజ్కు చెందిన సుంకర గణేష్, భవానీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. గణేష్ మామిడితోటలో కాపలాదారుగా ఉంటున్నాడు. గణేష్ పెద్ద కుమార్తె జ్ఞానేశ్వరి తండ్రి కోసం తోటకు వెళ్తూ దారి తప్పిపోయింది. ఎంత వెతికినా ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. డ్రోన్, డాగ్స్క్వాడ్ సహాయంతో కొండ ప్రాంతాన్ని దాదాపు 500మంది పోలీసులు 72గంటలుగా జల్లెడ పట్టినా ఆచూకీ దొరకలేదు.



