కడుపునొప్పితో దంపతుల మృతి.. కలకలం

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్కు చెందిన అజయ్ (28), అతడి భార్య దినేశ్వరి (25) గంటల వ్యవధిలో మృతి చెందారు. వకీల్పల్లిలో కూలీ పనులు చేసుకుంటున్న ఈ దంపతులు సోమవారం తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అజయ్ మృతి చెందగా, చికిత్స పొందుతూ దినేశ్వరి మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



