మధురవాడలో వివాహిత ఆత్మహత్య!

విశాఖ జిల్లా మధురవాడ ఆర్టీసీ కాలనీలో కోమలి (30) అనే వివాహిత సోమవారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరులేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. కొంతకాలంగా వాంబే కాలనీలో ఉంటున్న ఆమె ఇటీవల ఆర్టీసీ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఒంటరిగా నివసిస్తోంది. గతంలో మున్నా అనే వ్యక్తిని వివాహం చేసుకుని, వ్యక్తిగత కారణాలతో విడిపోయినట్లు సమాచారం. ఘటనపై పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియల్సి ఉంది.



