అమెరికాలో గుండెపోటుతో నగర వాసి మృతి!

అమెరికాలో తెలుగు కమ్యూనిటీలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ బేగంపేటకు చెందిన MBA సాఫ్ట్వేర్ ఇంజినీర్ రావుల పవన్ సాయి వంశీ (36) గుండెపోటుతో మృతి చెందారు. ఈ నెల 9న కాలిఫోర్నియాలోని నివాసంలో పిల్లలతో ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలారు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని హైదరాబాద్కు తీసుకురాగా, బన్సీలాల్పేటలో అంత్యక్రియలు నిర్వహించారు.



