కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి సూసైడ్

TG: లోన్ ఏజెంట్ల వేధింపులకు ఓ యువతి సూసైడ్ చేసుకుంది. హైదరాబాద్లోని నాగోల్కు చెందిన రోజా రమణి (26) దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్లో అకౌంటెంట్గా పనిచేస్తున్న ఆమె బ్యాంక్ లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు భరించకలేక సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. రోజా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



