అధికారుల అండతోనే బుక్ బిజినెస్: TGVP

TG: నిజామాబాద్ జిల్లా బోధన్ టౌన్లో కొనసాగుతున్న పుస్తకాల వ్యాపారంపై తెలంగాణ విద్యార్థి పరిషత్(TGVP) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ అధికారులు అండదండలు ఉన్నాయని, వారి పోద్బలంతో ఇష్టరాజ్యంగా వ్యాపారం కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని TGVP నాయకులు మీసాల నగేష్ ఆరోపించారు. బోధన్ MEO నాగయ్యను తాము కలిసి సమస్యను విన్నవిస్తే పుస్తకాల విక్రయాలను అడ్డుకునే అధికారం తమకులేదని సమాధానం చెప్పారన్నారు. DEO అశోక్ను తాము ఫోన్లో సంప్రదిస్తే సరైన సమాధానం ఇవ్వకపోవడంలో అంతర్యం ఏంటని ప్రశ్నించారు.



