← Back to news

మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

By DK· 31 Jul 2026
మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

TG: వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ MLA, సీనియర్ BRS నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి (52) కన్నుమూశారు. పల్మనరీ ఎంబోలిజంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇటీవల గుండెపోటుకు గురైన అనంతరం ఆయన ఆస్పత్రిలో చేరారు. 2019లో నర్సంపేట ఎమ్మెల్యేగా గెలిచిన సుదర్శన్ రెడ్డి, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. KCRకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఆయన మృతి పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

More in Politics