తిరుపతి NIELIT క్యాంపస్ తరలింపు సరికాదు

తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం(SVU) ప్రాంగణంలో టెంపరరీగా ప్రారంభించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(NIELIT) శాశ్వత క్యాంపస్ను రాజధాని మంగళగిరికి తరలించాలనే ప్రభుత్వం నిర్ణయాన్ని ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా కార్యదర్శి అక్బర్, డివైఎఫ్ఐ తిరుపతి జిల్లా కన్వీనర్ వీరేష్ ఖండించారు. 1,200 మందికి పైగా విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారని, ఇలాంటి కీలక సంస్థను వేరే ప్రాంతానికి మళ్లించడం సీమ యువత భవిష్యత్తుపై గొడ్డలిపెట్టు అని ఆందోళన వ్యక్తం చేశారు.

