మణిపూర్ లో మళ్లీ హింస నలుగురు మృతి

మణిపూర్ మళ్లీ హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లా మొయిరాంగ్ ట్రోంగ్లోబీ ఏరియాలో మిలిటెంట్లు జరిపిన బాంబు దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆ పిల్లల తల్లి గాయపడ్డారు. దీంతో ఆందోళనకు దిగిన స్థానికులు CRPF క్యాంపుపై దాడి చేశారు. భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మరణించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. పరిస్థితుల్ని అదుపులోకి అయిదు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు



