మక్తల్ ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షునిగా రాఘవేందర్ ఎన్నిక

మక్తల్ మండల ఉప సర్పంచులకు కొత్త నాయకత్వం వచ్చేసింది. ఉప సర్పంచ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా అధ్యక్షులు మ్యాతరి గోపాల్ ఆధ్వర్యంలో శనివారం మక్తల్ మండల కమిటీని ఎన్నుకున్నారు. కొత్త మండల కమిటీ ఇదే: అధ్యక్షులు – రాఘవేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు – కె. సత్యన గౌడ్, ప్రధాన కార్యదర్శి – నంబర్ తిరుపతి, కోశాధికారి – ఎం. సురేష్, జిల్లా కమిటీ సభ్యులు – వాకిటి రమేష్,,, నూతన కమిటీ అధ్యక్షుడు రాఘవేందర్ రెడ్డి షమండలంలోని ఉప సర్పంచుల సమస్యలపై పోరాడతానని అన్నారు.

