← Back to news

🏫 జూనియర్ కాలేజీలో క్లాస్ రూమ్స్ లేవు

By VITTAL· 25 Aug 2026· కామారెడ్డి
🏫 జూనియర్ కాలేజీలో క్లాస్ రూమ్స్ లేవు

TG : కామారెడ్డి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 1000 మందికి పైగా స్టూడెంట్స్ చదువుతున్నారు. కానీ సరిపడా రూమ్స్ లేక స్టూడెంట్స్ చెట్ల కింద కూర్చుని చదువుకోవాల్సి వస్తోంది. ఒకే రూమ్‌లో రెండు మూడు కోర్సులు కూర్చుంటూ ఇబ్బందులు పడుతున్నారు. బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేవని మండిపడుతూ SFI, AISA ఆధ్వర్యంలో విద్యార్థులు కాలేజ్ ఎదుట ప్రొటెస్ట్ చేశారు. గవర్నమెంట్, లోకల్ ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని డిమాండ్ చేశారు.

More in Local

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు
Local· 23m ago

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు

TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో ఆన్‌లైన్ సెంటర్ కోసం నిర్మించిన రేకుల షెడ్డు ధ్వంసం కావడం వివాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన ఉప్పర్ నగేష్ పాఠశాల ఎదుట ఆన్‌లైన్ సెంటర్ ఏర్పాటుకు రేకుల షెడ్డు నిర్మించారు. పంచాయతీ అనుమతులు లేవంటూ అదే గ్రామానికి చెందిన ఇబ్రహీం అభ్యంతరం వ్యక్తంచేసి కర్రతో షెడ్డు ధ్వంసం చేసినట్లు నగేష్ ఆరోపించారు. నిర్మాణానికి అనుమతి కోరుతూ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఇబ్రహీంపై చర్యలు తీసుకోవాలని బషీరాబాద్ PSలో ఫిర్యాదు చేశారు.