చదువు ఒక్కటే కాదు.. స్కిల్ కూడా ఉండాలి: CM

తెలంగాణలో విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని CM రేవంత్రెడ్డి అన్నారు. హైదరాబాద్లో జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చదువుతో తలరాత మారుతుందని, అన్ని వర్గాలు కలిసి చదువుకోవడం ద్వారా కులవ్యవస్థ నిర్మూలన సాధ్యమవుతుందని చెప్పారు. యంగ్ ఇండియా స్కూళ్ల ద్వారా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. ఏటా రూ.2,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ముందుగానే జమ చేస్తున్నామని వెల్లడించారు.



