← Back to news

మహిళని చంపి ఆ డెడ్‌బాడీతో 350 కి.మీ. ప్రయాణం

By Mahesh· 29 Jul 2026· మహారాష్ట్ర
మహిళని చంపి ఆ డెడ్‌బాడీతో 350 కి.మీ. ప్రయాణం

మహారాష్ట్రలో దారుణ ఘటన జరిగింది. మరొకరితో సంబంధముందన్న అనుమానంతో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న మహిళను గొంతు నులిమి చంపాడు. హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కొల్హాపూర్ జిల్లాలోని షిర్గావ్ గ్రామానికి చెందిన ప్రకాష్ ఆనంద్ పాటిల్ (40) ఆదివారం తన పొలంలో సురేఖ శివాజీనే ఆరే (40)ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. తరువాత మృతదేహాన్ని కారులో 350 కి.మీ. దూరంలోని థానే జిల్లా భివండీలోని కషెలికి తరలించినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 11h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.