పోచమ్మ తల్లికి బోనాలు.. భక్తులతో కిక్కిరిసిన కొందుర్గు

TG: కొందుర్గులో పోచమ్మ తల్లి బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. రంగారెడ్డి జిల్లా కొందుర్గులో శ్రావణమాసం రెండో శుక్రవారం, వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని గ్రామ ప్రజలు పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామాన్ని సుభిక్షంగా ఉంచాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.




