240 మందితో షిప్ మిస్సింగ్.. జావా సముద్రంలో సెర్చ్!

240 మందితో వెళ్తున్న ఇండోనేషియా ప్యాసింజర్ షిప్ జావా సముద్రంలో కాంటాక్ట్ కోల్పోయింది. ‘విర్గో ట్రాన్స్పోర్ట్ 8’ సురబయా నుంచి సౌత్ కలిమంతన్లోని బంజార్మసిన్కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చివరిసారిగా బంజార్మసిన్కు 148 కి.మీ దూరంలో షిప్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్లో ఇప్పటివరకు 103 మందిని పైగా సేఫ్గా బయటకు తీసుకొచ్చారు. మిగతావారి కోసం సెర్చ్ కొనసాగుతోంది. బ్యాడ్ వెదర్ వల్లే ఈ ఘటన జరిగినట్లు షిప్ ఆపరేటర్ తెలిపాడు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సమాచారం లేదు.


