KGBV విద్యార్థుల రాఖీ వేడుకలు

రాఖీ పండుగ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)ని జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ రమేష్ కుమార్ సందర్శించారు. కేజీబీవీ విద్యార్థినిలు ఆయనకు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థినుల ఆప్యాయతకు ఆయన అభినందనలు చెప్పారు. విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.


