16తులాల బంగారం ఉన్నా దోచుకోలేకపోయారు

TG: మేడ్చల్ జిలా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలోని అద్రాస్పల్లికి చెందిన సంగిశెట్టి శ్రీనివాస్, సంతోష దంపతులు ఈ నెల 17న శిర్డీకి వెళ్లారు. దొంగల కన్ను బీరువాలపై పడుతుందని శ్రీనివాస్ 16తులాల బంగారు నగలు, రూ.3లక్షల నగదును బీరువాలో పెట్టకుండా విడివిడిగా దాచిపెట్టాడు. అతని భార్య సంతోష భర్తకు చెప్పకుండా రూ.30వేల నగదును బీరువాలోనే ఉంచేసింది. శిర్డీయాత్ర ముగించుకుని తిరిగి రాగా, బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. దొంగలు పడినా 16తులాల బంగారం, రూ.3లక్షల నగదు సురక్షితంగా ఉన్నాయని శ్రీనివాస్ తెలిపాడు. సంతోష బీరువాలో పెట్టిన 30వేలను దొంగలు దోచుకెళ్లారు.



