అయ్యో పాపం.. 11 ఏళ్ల కవలలను బావిలో తోసేసి..!

తమిళనాడులోని తేని జిల్లా రంగానాథపురానికి చెందిన శ్రీహరీష్ (11), శబరీష్ (11) అనే కవల అన్నదమ్ములను కేశవ్ బాలాజీ (19) అనే యువకుడు బావిలోకి తోసి దారుణంగా హత్య చేశాడు. శుక్రవారం సాయంత్రం ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలు మిస్సింగ్ అవ్వడంతో పేరెంట్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేపట్టిన పోలీసులకు కరడుపట్టిలోని వ్యవసాయ బావిలో పిల్లల డెడ్బాడీస్ కనిపించాయి. ఊరి బయట మంచి పావురాళ్లు ఉన్నాయని నమ్మించి, బావి దగ్గరకు తీసుకెళ్లి తోసేసినట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు.



