‘ముందు ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై మాట్లాడండి’
TG: ‘ముందు ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై మాట్లాడండి’ అంటూ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యకు సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల భారం ప్రస్తుతం రాష్ట్రంపై ఉందని అన్నారు. కృష్ణయ్య పదేపదే తెలంగాణ ఫీజు రీయింబర్స్మెంట్పై ప్రశ్నిస్తున్నారు కానీ, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బకాయిలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. భవిష్యత్తులో తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య ఉండదని స్పష్టం చేశారు.



