← Back to news

బాలసదన్ నుంచి ఇద్దరు బాలికలు మిస్సింగ్

By DK· 29 Jul 2026· పెద్దపల్లి జిల్లా
బాలసదన్ నుంచి ఇద్దరు బాలికలు మిస్సింగ్

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని బాలసదన్ చిల్డ్రన్ హోమ్ నుంచి ఇద్దరు బాలికలు అదశ్యమయ్యారు. మార్కండేయ కాలనీలో ఉన్న బాలసదన్‌లో కుర్చీలు వేసుకుని కాంపౌండ్ గోడ దూకి తెల్లవారుజామున వెళ్లిపోయినట్లు అధికారులు గుర్తించారు. పాలితం గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని ఉమామహేశ్వరి(15), ఉప్పరిపల్లెకు చెందిన 4వ తరగతి విద్యార్థిని ఆకృతి(8) మిస్సయ్యారు. ఉమామహేశ్వరి 3 రోజుల క్రితమే బాలసదన్‌కు వచ్చినట్లు సమాచారం. సూపరింటెండెంట్ వనిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

More in TG