అధ్వానంగా మారిన రహదారి.. పట్టించుకోని అధికారులు

TG: కొమురంభీమ్ జిల్లా బెజ్జూర్ మండలంలోని మొగవెల్లి–సోమిని మధ్య రహదారి పలుచోట్ల భారీ గుంతలతో అధ్వానంగా మారింది. ఈ మార్గంలో నిత్యం వాహనాల రాకపోకలు కొనసాగుతుండటంతోపాటు గూడెం, అహేరి వైపు వెళ్లే వాహనాలు కూడా ఇదే రహదారిని వినియోగిస్తున్నాయి. గుంతల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళల్లో గుంతలు కనిపించకపోవడంతో ప్రమాదాల ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.



