ప్రేమ వివాదంతో యువకుడి ఆత్మహత్య

AP: చోడవరంలోని ద్వారకానగర్లో లక్కరాజు ప్రశాంత్(23) బీటెక్ పూర్తి చేసి GATE పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నాడు. తను ప్రేమించిన అమ్మాయితో గొడవ జరగడంతో బాధ తట్టుకోలేక బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. అతనికి తల్లి, తాపీ పని చేసే తండ్రి నాయుడు, ఒక సోదరుడు ఉన్నారు. కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. SI జోగారావు అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.



