సాక్ష్యాలు తారుమారు చేసేందుకు యత్నం.. చివరికీ

హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో నివసించే దంపతులకు మూడున్నర ఏళ్ల కుమార్తె ఉంది. ఆమెను 2019 జూన్ 12 నుంచి స్థానికంగా ఓ ప్లేస్కూల్కు పంపించారు. పాఠశాలలో కరాటే కోచ్గా పనిచేసే కిరణ్సాయి(24) పాపపై అత్యాచారం చేశాడు. విషయాన్ని అమ్మమ్మకు పాప చెప్పింది. ఆమె పోలీసులకు చెప్పడంతో నిందితుడిని అరెస్టు చేశారు. ప్లేస్కూల్ ప్రిన్సిపల్ దీపిక సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యత్నించారు. కేసును విచారించిన రాజేంద్రనగర్ పోక్సో కోర్టు నిందితుడు కిరణ్సాయికి 20ఏళ్ల జైలుశిక్ష, ప్రిన్సిపల్కు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.



