← Back to news

సాక్ష్యాలు తారుమారు చేసేందుకు యత్నం.. చివరికీ

By dk· 18 Jun 2026· Eenadu· హైదరాబాద్‌
సాక్ష్యాలు తారుమారు చేసేందుకు యత్నం.. చివరికీ

హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసించే దంపతులకు మూడున్నర ఏళ్ల కుమార్తె ఉంది. ఆమెను 2019 జూన్ 12 నుంచి స్థానికంగా ఓ ప్లేస్కూల్‌కు పంపించారు. పాఠశాలలో కరాటే కోచ్‌గా పనిచేసే కిరణ్‌సాయి(24) పాపపై అత్యాచారం చేశాడు. విషయాన్ని అమ్మమ్మకు పాప చెప్పింది. ఆమె పోలీసులకు చెప్పడంతో నిందితుడిని అరెస్టు చేశారు. ప్లేస్కూల్ ప్రిన్సిపల్ దీపిక సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యత్నించారు. కేసును విచారించిన రాజేంద్రనగర్ పోక్సో కోర్టు నిందితుడు కిరణ్‌సాయికి 20ఏళ్ల జైలుశిక్ష, ప్రిన్సిపల్‌కు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 23h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.