← Back to news

సంకిలిలో రేపు చెరుకు రైతుల సమావేశం

By Mohan· 28 Aug 2026

విజయనగరం జిల్లా రేగడి ఆమదాలవలస మండలం సంకిలి గ్రామంలో ఉన్న చక్కెర కర్మగాన్ని ఎల్ నినో ప్రభావం వల్ల నిలిపేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. దీనిపై చెరుకు రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు రేపు(శనివారం) ఉదయం 10 గంటలకు సంకిలి గ్రామం హైస్కూల్ ఎదురుగా ఉన్న స్థలంలో ఆంధ్రప్రదేశ్ చెరకు రైతుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసినట్లు సంఘం కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తెలిపారు.

More in Local