← Back to news

మహిళను వేధించిన జూబ్లీహిల్స్ SHO సస్పెండ్

By RK· 29 Jul 2026
మహిళను వేధించిన జూబ్లీహిల్స్ SHO సస్పెండ్

TG: ఒక మహిళను వేధించి, బ్లాక్‌మెయిల్ చేసిన ఆరోపణలపై జూబ్లీహిల్స్ SHO యు. శ్రీనివాసులు రెడ్డిని అధికారులు సస్పెండ్ చేశారు. ఓ కేసు కోసం వచ్చిన తనను లోబరుచుకుని, లైంగికంగా వేధించి, అబార్షన్ చేయించాడని బాధితురాలు కంప్లైంట్ ఇచ్చింది. ప్రైవేట్ వీడియోలతో బెదిరించి రూ. 2 కోట్లు అడిగాడని చెప్పింది. జూబ్లీహిల్స్ పోస్టింగ్ కోసం ఆయన రూ. 25 లక్షలు లంచం ఇచ్చాడని కూడా ఆరోపించింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

More in TG