భార్యపై భర్త కిరాతకం.. పిల్లలతో పరార్
TG: జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం ఓబులకేశవపురంలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. మోకు మహేందర్ రెడ్డి తన భార్య మాధవిపై దాడిచేసి, ఆమె కాళ్లు, చేతులు విరిచిన అనంతరం ఇద్దరు చిన్నారులను తీసుకుని పరారయ్యాడు. మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించడంతో ఘటన జరిగినట్లు బాధితురాలు తెలిపింది. తనను చంపేందుకు ప్రయత్నించి, పిల్లలను కూడా హాని చేయాలనే ఉద్దేశంతో తీసుకెళ్లాడని ఆవేదన వ్యక్తంచేసింది. మహేందర్రెడ్డి పిల్లలతో కనిపించకపోగా, ఫోన్ స్విఛాఫ్లో ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



