← Back to news

భార్యపై భర్త కిరాతకం.. పిల్లలతో పరార్

By dk· 3 Aug 2026· జనగాం జిల్లా

TG: జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం ఓబులకేశవపురంలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. మోకు మహేందర్‌ రెడ్డి తన భార్య మాధవిపై దాడిచేసి, ఆమె కాళ్లు, చేతులు విరిచిన అనంతరం ఇద్దరు చిన్నారులను తీసుకుని పరారయ్యాడు. మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించడంతో ఘటన జరిగినట్లు బాధితురాలు తెలిపింది. తనను చంపేందుకు ప్రయత్నించి, పిల్లలను కూడా హాని చేయాలనే ఉద్దేశంతో తీసుకెళ్లాడని ఆవేదన వ్యక్తంచేసింది. మహేందర్‌రెడ్డి పిల్లలతో కనిపించకపోగా, ఫోన్ స్విఛాఫ్‌లో ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 9h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.