మరికొద్ది గంటల్లో నీట్.. విద్యార్థిని సూసైడ్

TG: ఆంధ్రప్రదేశ్లోని YSR కడప జిల్లాకు చెందిన జాఫర్ హుస్సేన్ కుటుంబం HYDలోని మియాపూర్లో నివాసముంటోంది. జాఫర్ కుమార్తె షేక్ సనా(19) NEET రీఎగ్జామ్కు ప్రిపేర్ అవుతుంది. లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకున్న సనా.. పరీక్ష ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. రీఎగ్జామినేషన్ ఒత్తిడిని తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది నీట్ పరీక్ష రాసినా ర్యాంక్ రాలేదు. దీంతో సనా మళ్లీ ప్రిపేర్ అవుతుంది. ఇవాళ జరిగే నీట్ పరీక్ష ఆమె రాయాల్సి ఉంది.



