రోడ్ల నిర్మాణం మరింత భారం

యుద్ధం ఆగింది. కానీ దాని ఎఫెక్ట్ మన మీద బాగా పడింది. రోడ్ల నిర్మాణం తడిసి మోపెడైంది. రోడ్లు వేయడానికి వినియోగించే బిటుమెన్, ఫర్నేస్ ఆయిల్, లైట్ డీజిల్ ఆయిల్ ధరలు బాగా పెరిగిపోయాయి. నిన్నటి వరకు టన్ను రూ50 వేలకు వచ్చే బిటుమెన్ ఒక్కసారిగా రూ.82 వేలకు పెరిగిపోయింది. ఇక లైట్ డీజిల్ ఆయిల్ లీటర్ రూ50 ఉండేది రూ172కి పెరిగింది. ఫర్నేస్ ఆయిల్ లీటర్ 40 నుంచి 102 రూపాయలకు పెరిగింది. దీంతో ప్రభుత్వ ఖజానాపై వేల కోట్ల రూపాయల భారం పెరిగే ఛాన్స్ ఉంది



