ఉస్మానియా దవఖానలో తాగు నీటి కొరత !!

ఉస్మానియా ప్రభుత్వాసుపత్రిలో తాను నీరు లేక రోగులు నానా అగాట్లు పడుతున్నారు. కనీసం వాష్ రూమ్స్ లోసైతం నీటి సౌకర్యం లేక నానా అవస్థలూ పడుతున్నారు.రోజుకు వేల సంఖ్యలో పేషెంట్స్ వచ్చే ఆస్పత్రిలో తాగు నీరు లేకపోవడం మెట్రో వాటర్ బోర్డు వైఫల్యమేనని రోగులు ఆరోపిస్తున్నారు. అధికార్ల నిర్లక్ష్యం వల్ల నిరపరాధ రోగులకు శిక్ష పడుతోందని.. అధికారుల వైఫల్యాన్ని చక్క దిద్దాలని పేషెంట్స్ కోరుతున్నారు.



