జనగాం జిల్లాలో ఘోర ప్రమాదం

TG: జనగాం జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. రోడ్డుపై నిలిపి ఉన్న లారీని వేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో నర్సింగపురం తండాకు చెందిన కేతావత్ నరేందర్, బాదావత్ తిరుపతి స్పాట్లోనే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



