ఉర్దూ కోర్సుల పునఃప్రారంభానికి చర్యలు

AP: ఉర్దూ మాధ్యమ విద్యార్థులకు ఉన్నత విద్యలో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు దూరవిద్యా కోర్సులను పునఃప్రారంభించనున్నట్లు బిఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ విజయభాస్కర్ రావు హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా RUTA AP ప్రతినిధులు వీసీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉర్దూ మాధ్యమ దూరవిద్యా కోర్సులను తిరిగి ప్రారంభించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన వీసీ, ఈ డిసెంబర్ నుంచే కోర్సులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీసీ హామీపై RUTA AP ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

