← Back to news

కొడుకు జాబ్ పోయిందని ఫ్యామిలీ సూసైడ్!

By sahani· 16 Jun 2026· Nellore
కొడుకు జాబ్ పోయిందని ఫ్యామిలీ సూసైడ్!

నెల్లూరు జిల్లా దువ్వూరులో రిటైర్డ్ టీచర్ మధుసూదన్ రావు, భార్య రత్నావళి, దత్తపుత్రుడు సాయి సుకీత్ ఒకే ఇంట్లో శవాలై కనిపించారు. తిరుపతిలో జాబ్ చేస్తున్న కొడుక్కి కంపెనీ వాళ్లు శాలరీ ఇవ్వకుండా, పర్ఫార్మెన్స్ బాలేదని సర్టిఫికెట్స్ ఇచ్చి పంపేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లిదండ్రులు.. తాము లేకపోతే అమాయకుడైన కొడుకు బతకలేడని భావించి, అందరూ కలిసి సూసైడ్ చేసుకున్నారు. చనిపోయే ముందు రాసిన లెటర్ లో.. అంత్యక్రియల ఖర్చులకి డబ్బులు పంపిస్తూ, ఆస్తులను బంధువులకి, రెడ్ క్రాస్ సొసైటీకి ఇవ్వాలని కోరారు.

కొడుకు జాబ్ పోయిందని ఫ్యామిలీ సూసైడ్!

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.