కొడుకు జాబ్ పోయిందని ఫ్యామిలీ సూసైడ్!

నెల్లూరు జిల్లా దువ్వూరులో రిటైర్డ్ టీచర్ మధుసూదన్ రావు, భార్య రత్నావళి, దత్తపుత్రుడు సాయి సుకీత్ ఒకే ఇంట్లో శవాలై కనిపించారు. తిరుపతిలో జాబ్ చేస్తున్న కొడుక్కి కంపెనీ వాళ్లు శాలరీ ఇవ్వకుండా, పర్ఫార్మెన్స్ బాలేదని సర్టిఫికెట్స్ ఇచ్చి పంపేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లిదండ్రులు.. తాము లేకపోతే అమాయకుడైన కొడుకు బతకలేడని భావించి, అందరూ కలిసి సూసైడ్ చేసుకున్నారు. చనిపోయే ముందు రాసిన లెటర్ లో.. అంత్యక్రియల ఖర్చులకి డబ్బులు పంపిస్తూ, ఆస్తులను బంధువులకి, రెడ్ క్రాస్ సొసైటీకి ఇవ్వాలని కోరారు.




