గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు: సీఎం

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలం గన్నెల పంచాయతీ ఆర్కే నగర్లో ‘సంజీవని’ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఆరోగ్య రథాల ద్వారా గిరిజనులకు ఇంటి వద్దే వైద్య పరీక్షలు, మందులు, ఫాలోఅప్ సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. గన్నెల పీహెచ్సీలో సేకరించిన రక్త నమూనాలను డ్రోన్లతో విశాఖ జీజీహెచ్కు తరలించే ప్రక్రియను పరిశీలించారు. మారుమూల ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.



