హైవేపై ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్డెడ్

TG: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులోని హైదరాబాద్-విజయవాడ హైవేపై అతివేగంగా వచ్చిన ట్రావెల్స్ బస్సు ఎదురుగా ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. కారులో ఉన్న నలుగురు స్పాట్లో ప్రాణాలు కోల్పోగా, కారు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న చిట్యాల పోలీసులు తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్ను సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. నేషనల్ హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోగా, పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ప్రమాదం ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.



