గొడ్డళ్లు, తుపాకీతో స్మగ్లర్స్.. అటవీశాఖ హైఅలర్ట్

AP: మార్కాపురం జిల్లా కనిగిరి రేంజ్ పరిధిలోని శేషాచలం కనుమల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ మళ్లీ అలజడి రేపింది. వెలిగండ్ల మండలంలో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న నలుగురు స్మగ్లర్లను అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి గొడ్డళ్లతో పాటు ఒక నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. వారు దాడులు చేసేందుకు ఆయుధాలు సమకూర్చుకోవడంతో అధికారులు షాక్ అయ్యారు. CSపురం, వెలిగండ్ల, హనుమంతునిపాడు మండలాల్లో 15 వేల హెక్టార్లలో ఎర్రచందనం చెట్లు ఉండటంతో అధికారులు అప్రమత్తమై నిఘా పెంచారు.



