ప్రైవేట్ ల్యాబ్లపై ఆరోపణలు

నర్సంపేట పట్టణంలోని కొన్ని ప్రైవేట్ ల్యాబ్లలో నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు టెక్నీషియన్లు పరీక్షల ఫలితాలను మాన్యువల్గా తమకు నచ్చినట్లు నమోదు చేస్తున్నారనే విమర్శలున్నాయి. అర్హత లేని వారు టెక్నీషియన్లుగా కొనసాగుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్లో చికిత్స పొందిన ఓ రోగికి జాండీస్ పరీక్షల్లో హెచ్చుతగ్గులతో రిపోర్టులు రావడం చర్చనీయాంశమైంది. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ల్యాబ్లను తనిఖీ చేసి వాస్తవాలను నిగ్గుతేల్చాలని ప్రజలు కోరుతున్నారు.

