గుత్తా ఫొటో మిస్సింగ్.. నల్గొండలో ప్రోటోకాల్ రచ్చ

TG: CM రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన రసాభాసగా మారింది. సీఎం సభ సందర్భంగా R&B శాఖ ఇచ్చిన పత్రికా ప్రకటనలో శాసనమండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటో లేకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. ప్రోటోకాల్ పాటించలేదని సంబంధిత అధికారులకు గుత్తా సుఖేందర్ రెడ్డి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు సభకు రావొద్దంటూ DCC అధ్యక్షుడు కైలాష్ నేతను మంత్రి కోమటిరెడ్డి వర్గం నాయకులు హెచ్చరించారు. తనకు ఆహ్వానం అందలేదని, అయినా సభకు హాజరవుతానని కైలాష్ సవాల్ చేశారు. దీంతో కైలాష్ నేతను, ఆయన వర్గాన్ని అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం.




