← Back to news

ఐదుగురు మత్స్యకారులు మృతి

By DK· 18 Jul 2026· పోలవరం జిల్లా
ఐదుగురు మత్స్యకారులు మృతి

AP: పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన ఐదుగురు మత్స్యకారులు నీటిలో మునిగి మృతి చెందారు. మృతులు ఊకె సుశీల (37), లక్ష్మి (37), తుర్రం భారతి (40), భాసుబోయిన బాలరాజు (38), ఊకె రమేష్ (38)లుగా గుర్తించారు. గోదావరిలో లోతైన ప్రాంతంలో చేపల వేటకు వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు మృతితో గొమ్ముకొత్తగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

More in AP