← Back to news

స్టూడెంట్స్‌కు EMIలో డ్రగ్స్ అమ్ముతున్న టీచర్లు

By Mahesh· 30 Jul 2026· కేరళ
స్టూడెంట్స్‌కు EMIలో డ్రగ్స్ అమ్ముతున్న టీచర్లు

కేరళలో కోజికోడ్‌లోని పెరంబ్రా బ్లాక్ రిసోర్స్ సెంటర్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) విచారణ జరిపింది. ఇందులో గవర్నమెంట్ టీచర్లు డ్రగ్స్ ఏజెంట్లుగా ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో రెండు రోజుల క్రితం ఇద్దరు టీచర్లు పోలీసులు అరెస్టు చేయగా, ఈరోజు ఇంకో టీచర్ను అరెస్ట్ చేశారు. స్టూడెంట్స్‌కు EMI పద్ధతిలో డ్రగ్స్ అమ్ముతున్నట్లు విచారణలో తేలింది. ఒకవైపు విద్యార్థుల్లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవేర్నెస్ కల్పిస్తూ, మరోవైపు వారికే డ్రగ్స్ అమ్మడం గమనార్హం.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 11h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.