'నీట్' పేపర్ లీక్ పై రేపు BRS ప్రొటెస్ట్

TG: దిల్లీలో NEET పేపర్ లీక్ ప్రొటెస్ట్లో విద్యార్థులపై జరిగిన పోలీసుల అణచివేతను ఖండిస్తూ, సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ BRS పార్టీ నిరసనకు పిలుపునిచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్ KTRతో కలిసి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని ఇందిరాపార్క్లో నిరసనకు హాజరవుతారు. వేలాది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్న NEET లీక్ను ఖండిస్తూ, ఈ నిరసనను చేపట్టనున్నారు



