← Back to news

నేలబావిలో గుర్తుతెలియని మృతదేహం కలకలం

By siva· 1h ago
నేలబావిలో గుర్తుతెలియని మృతదేహం కలకలం

AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కామేపల్లి శివారులోని పల్లా నాగయ్య నేలబావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. బావిలో మృతదేహం తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ సీఐ వెంకట్రావు సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీయించారు. మృతుడి వయస్సు సుమారు 46 ఏళ్లుగా ఉంటుందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి, మృతుడి గుర్తింపు, మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట్రావు వెల్లడించారు.

More in Local

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు
Local· 8m ago

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు

TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో ఆన్‌లైన్ సెంటర్ కోసం నిర్మించిన రేకుల షెడ్డు ధ్వంసం కావడం వివాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన ఉప్పర్ నగేష్ పాఠశాల ఎదుట ఆన్‌లైన్ సెంటర్ ఏర్పాటుకు రేకుల షెడ్డు నిర్మించారు. పంచాయతీ అనుమతులు లేవంటూ అదే గ్రామానికి చెందిన ఇబ్రహీం అభ్యంతరం వ్యక్తంచేసి కర్రతో షెడ్డు ధ్వంసం చేసినట్లు నగేష్ ఆరోపించారు. నిర్మాణానికి అనుమతి కోరుతూ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఇబ్రహీంపై చర్యలు తీసుకోవాలని బషీరాబాద్ PSలో ఫిర్యాదు చేశారు.