హత్య చేసి..శవంతో సెల్ఫీలు దిగారు

మందు తాగొద్దని, పనికి వెళ్లమని హెచ్చరించినందుకు కోయంబత్తూరు జిల్లా సిక్కలంపాళయంలో ఎస్.అశ్విన్(22) అనే కూలీని ఇద్దరు యువకులు హత్య చేశారు. 21 ఏళ్ల మథేష్, మరొక 16 ఏళ్ల యువకుడు కత్తి, కొడవలి, సుత్తితో దాడి చేసి చంపారు. హత్యను వీడియో తీసి, శవంతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నాయి.



