చనిపోయి పదిరోజులైనా ఎవరికీ తెలియదు

TG: నల్గొండ జిల్లా దేవరకొండలోని గాంధీనగర్లో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధుడు మరణించి పదిరోజులు గడిచినా ఎవరికీ తెలియకపోవడం తీవ్ర కలకలం రేపింది. ఇంట్లోకి ప్రవేశించిన కుక్కలు, పందులు మృతదేహాన్ని పీక్కుతినడంతో శరీరభాగాలు వేరైనట్లు డాక్టర్స్ నిర్ధారించారు. పదిరోజుల కిందే ఆయన మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు నేరడుగొమ్ముకు చెందిన నాయిని రాజిరెడ్డి (80)గా గుర్తించారు. రాజిరెడ్డి మృతికి గల అసలు కారణాలు పోస్టుమార్టం నివేదిక వచ్చాకే తెలియాల్సి ఉంది.



