← Back to news

చనిపోయి పదిరోజులైనా ఎవరికీ తెలియదు

By DK· 8 Jun 2026· Hmtvlive· నల్గొండ జిల్లా
చనిపోయి పదిరోజులైనా ఎవరికీ తెలియదు

TG: నల్గొండ జిల్లా దేవరకొండలోని గాంధీనగర్‌లో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధుడు మరణించి పదిరోజులు గడిచినా ఎవరికీ తెలియకపోవడం తీవ్ర కలకలం రేపింది. ఇంట్లోకి ప్రవేశించిన కుక్కలు, పందులు మృతదేహాన్ని పీక్కుతినడంతో శరీరభాగాలు వేరైనట్లు డాక్టర్స్ నిర్ధారించారు. పదిరోజుల కిందే ఆయన మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు నేరడుగొమ్ముకు చెందిన నాయిని రాజిరెడ్డి (80)గా గుర్తించారు. రాజిరెడ్డి మృతికి గల అసలు కారణాలు పోస్టుమార్టం నివేదిక వచ్చాకే తెలియాల్సి ఉంది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.