రూ.110 కోసం దారుణ హత్య

TG: హైదరాబాద్ లాలాగూడ పోలీస్స్టేషన్ పరిధిలో హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్కు చెందిన జైప్రకాష్ దేశ్ముఖ్ హైదరాబాద్లో మేస్త్రీ పనులు చేస్తాడు. మోండామార్కెట్ ప్రాంతంలో జైప్రకాశ్ దేశ్ముఖ్కు తుకారాంగేట్కు చెందిన దాబీ వినోద్, అడ్డగుట్టకు చెందిన మక్కల మోహన్ పరిచయమయ్యారు. జైప్రకాష్ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. డబ్బు, ఫోన్ దోచుకునే ప్రయత్నంలో జైప్రకాష్ ప్రతిఘటించడంతో రాళ్లతో దాడిచేసి హత్య చేశారు. అనంతరం రూ.110 నగదు, ఫోన్ దోచుకుని పరారయ్యారు.



