గురుకులంలో ర్యాగింగ్ కలకలం

TG: కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లోని జ్యోతి బాపూలే గురుకుల పాఠశాల, కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. దహెగాం మండలానికి చెందిన ఓ విద్యార్థిని గురుకుల పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. రాత్రి భోజనం చేసిన తర్వాత బాలికను కొందరు విద్యార్థినులు అడ్డుకున్నారు. తమను గుర్తుపట్టకుండా ముఖంపై దుప్పటి కప్పి నోట్లో పెన్ను క్యాప్ వేసి బలవంతంగా నీళ్లు తాగించారు. క్యాప్ కడుపులోకి వెళ్లడంతో విద్యార్థిని ఎస్వోకు సమాచారం అందించడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్స్ క్యాప్ను బయటకు తీశారు. బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో ఇంటికి తీసుకెళ్లారు.



