రాజ్యాంగ హక్కుల సాధన కమిటీ ఏర్పాటు

TG: మహబూబ్నగర్ జిల్లాలో రాజ్యాంగ హక్కుల సాధన నూతన జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. క్రైస్తవులు, ముఖ్యంగా దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, రాజ్యాంగ హక్కుల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తామని నూతన జిల్లా అధ్యక్షుడు గట్టు డేవిడ్, ప్రధాన కార్యదర్శి జయరాజు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో కాశపోగు ప్రసాద్, జి.జి. యోనా అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా, పట్టణ కమిటీలను ప్రకటించారు. జిల్లా సలహాదారుగా తిమ్మయ్య, పట్టణ అధ్యక్షుడిగా A. జగన్ తదితరులను ఎన్నుకున్నారు.





