అంబేద్కర్ వారసత్వం అందరిది: అభిజీత్ దిప్కే
నేషనల్ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే మాట్లాడుతూ.. డాక్టర్ అంబేద్కర్ వారసత్వం ఏ ఒక్క వర్గానికే పరిమితం కాదన్నారు. ప్రస్తుత భారతదేశ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. మహిళలు, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు విశేష కృషి చేశారని పేర్కొన్నారు. రాజ్యాంగంపై విశ్వాసం ఉంచి, అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడే ప్రతి ఒక్కరికీ "జై భీమ్" నినాదం చెందుతుందని అభిజీత్ దిప్కే అన్నారు.


