← Back to news

'మమల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి'

By DK· 8 Jun 2026· Hmtvlive· రాజన్నసిరిసిల్ల జిల్లా
'మమల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి'

TG: గాలివాన బీభత్సానికి రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వెంకటరావుపల్లి విలేజ్‌లో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఈ ఘటనతో బాధిత కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. గ్రామంలో తోట శాంతమ్మ, పూదరి అంజయ్య ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వెలిశాల లక్ష్మీపతి పెంకుటిల్లు పూర్తిగా కూలిపోయింది. సాదక్ నిషా ఇల్లు గాలివానకు దెబ్బతింది. పలువురు ఇళ్లు కూడా వర్ష బీభత్సానికి పూర్తిగా ధ్వంసం కావడంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు వేడుకున్నారు.

More in Local